అడివి శేష్ 'మేజర్' విడుదల వాయిదా!

Major movie release date postponed
  • షూటింగు దశలో 'మేజర్'
  • కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అతని సినిమాలు ఆసక్తికరమైన కాన్సెప్ట్ లతో రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదు.

కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. కరోనా పరమైన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. సయీ మంజ్రేకర్ .. శోభితా ధూళిపాళ్ల .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Adivi Sesh
Saiee Manjrekar
Prakash Raj

More Telugu News