Dhulipala Narendra Kumar: రాజమండ్రి జైలు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర విడుదల

  • సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్లకు బెయిల్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • ధూళిపాళ్లతో పాటు విడుదలైన సంగం డెయిరీ ఎండీ
  • గత నెల 23న ధూళిపాళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ
TDP leader Dhulipalla Narendra released from Rajahmundry prison

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధూళిపాళ్ల నరేంద్ర రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా బెయిల్ పై బయటికి వచ్చారు.

గుంటూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ డెయిరీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జైల్లో ఉండగానే వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వీరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News