Madurai Couple: చార్టర్డ్ విమానంలో పెళ్లి... కరోనా మార్గదర్శకాలకు తిలోదకాలు!

  • వినూత్నంగా విమానంలో పెళ్లి 
  • మధురై నుంచి బెంగళూరు వెళుతూ మాంగల్యధారణ
  • అతిథులతో క్రిక్కిరిసిన స్పైస్ జెట్ విమానం
  • మాస్కుల్లేకుండానే కనిపించిన జనాలు
  • విచారణకు ఆదేశించిన డీజీసీఏ
 Madurai couple weds in mid air

తమిళనాడులోని మధురైకి చెందిన ఓ జంట తమ పెళ్లిని వినూత్నంగా విమానంలో జరుపుకుంది. తమ పెళ్లిని చిరస్మరణీయంగా చేసుకునేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఏర్పాటు చేశారు. ఈ వివాహం కోసం ఏకంగా ఓ విమానాన్నే అద్దెకు తీసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ విమానంలో మధురై నుంచి బెంగళూరు వెళుతూ గాల్లోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విమానం స్పైస్ జెట్ సంస్థకు చెందినది.

అయితే, కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.

More Telugu News