ఈటల రాజేందర్ కుమారుడిపై ఓ యువకుడి ఫిర్యాదు.. వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
- మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్ ఫిర్యాదు
- సీఎంకు లేఖ రాసిన యువకుడు
- దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్న కేసీఆర్
తెలంగాణలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన భూములపై కొన్ని రోజులుగా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా భూ కబ్జాకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడం గమనార్హం.