సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడి భరోసా నింపిన కేసీఆర్
- ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
- కలెక్టరేట్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్నీ సమకూర్చుకోవాలని సూచించారు. మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని చెప్పారు.