Akash Puri: 'రొమాంటిక్' రిలీజ్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!

  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక శర్మ
  • దర్శకుడిగా అనిల్ పాదూరి పరిచయం
Clarity on Romantic movie release date

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా తనని తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఆయన తాజా చిత్రంగా రొమాంటిక్ రూపొందింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కథ - స్క్రీన్ ప్లే పూరి అందించారు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, చిత్రీకరణను పూర్తి చేసుకుని చాలా కాలం అయింది. అయితే కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దాంతో విడుదల ఆలస్యమవుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీకి రానుందని వార్తలు మొదలయ్యాయి.

'రొమాంటిక్' సినిమా విడుదల విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందనీ, థియేటర్లు తెరుచుకునే వరకూ ఎదురుచూడటం వలన ఇంకా ఆలస్యం జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్టుగా చెప్పుకున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ సినిమాను ఓటీటీ ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని అనుకున్నారు.

అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. 'రొమాంటిక్' సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నామనీ, ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అలా మొత్తానికి ఒక పుకారుకి ఫుల్ స్టాప్ పడిపోయింది.

More Telugu News