ఈ కరోనా వేరియంట్ ను తొలుత ఇండియాలోనే గుర్తించారు: కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ కౌంటర్
- సింగపూర్ వేరియంట్ ఇండియాకు ప్రమాదకరమన్న కేజ్రీవాల్
- మన దేశంలో మూడో వేవ్ కు దారితీసే అవకాశం ఉందని వ్యాఖ్య
- ఈ వేరియంట్ అనేక దేశాల్లో బయటపడుతోందన్న సింగపూర్
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ స్పందించింది. తమ దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. B.1.617.2 అనే ఈ వేరియంట్ అనేక కరోనా కేసుల్లో బయటపడిందని, సింగపూర్ లో కూడా వెలుగు చూసిందని పేర్కొంది. చిన్న పిల్లల్లో కూడా ఈ వైరస్ ను గుర్తించారని వెల్లడించింది. ఈ వేరియంట్ ను తొలుత ఇండియాలోనే గుర్తించారని... ఇప్పుడు అనేక దేశాల్లో ఈ వేరియంట్ బయటపడుతోందని బదులిచ్చింది.