నాన్నను ఆర్మీ అధికారులు కలవనీయలేదు: రఘురాజు కుమారుడు
- సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురాజు
- కలిసేందుకు వెళ్లిన కుటుంబసభ్యులు
- ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసిన అధికారులు
రఘురాజును కలిసేందుకు ఏ ఒక్కరికీ అనుమతి లేదని ఆర్మీ అధికారులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రఘురాజు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని... ఈ నేపథ్యంలో ఏ ఒక్కరినీ తాము అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో, ఆయన కుటుంబసభ్యులు అక్కడి నుంచి వెనుదిరిగారు.