టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి
- ఇటీవల వేదా కృష్ణమూర్తి తల్లి, సోదరి కరోనాతో మృతి
- తాజాగా ప్రియా పూనియా కుటుంబంలో విషాదం
- కరోనాకు చికిత్స పొందుతూ పూనియా తల్లి కన్నుమూత
- అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాన్న పూనియా
తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లే తన మార్గదర్శి అని, జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని పేర్కొంది. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని తెలిపింది. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని ప్రియా పూనియా సూచించింది.