సుశీల్ ను పట్టిస్తే రూ.లక్ష ఇస్తాం: రెజ్లర్ తలపై పోలీసుల రివార్డు
- యువ రెజ్లర్ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న వైనం
- మరో నిందితుడిపై రూ.50 వేలు
- ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
మే 4న ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో.. తోటి రెజ్లర్లపై సుశీల్, అతడి సహచరులు దాడికి దిగారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సాగర్ రాణా అనే 23 ఏళ్ల యువ రెజ్లర్ కన్నుమూశాడు. ఆ దాడితో తమకు సంబంధం లేదని మొదట్లో సుశీల్ ప్రకటించినా.. ఆ మర్నాటి నుంచే కనిపించకుండా పోయాడు.
పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపైనా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.