Maruthi: కొత్త కథపై మారుతి కసరత్తు!

  • వినోదమే ప్రధానంగా మారుతి సినిమాలు
  • 'మహానుభావుడు' తరువాత దక్కని హిట్
  • కొత్తదనమే ప్రధానమంటున్న మారుతి
Maruthi is ready to make a new script

మారుతి కెరియర్ మొదట్లో యూత్ మెచ్చే కథలను మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. మారుతి కంటూ ఒక మార్కు ఉంది .. అది దెబ్బతినకుండా ఆయన కథలను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మారుతికి 'మహానుభావుడు' సినిమా తరువాత చెప్పుకోదగిన హిట్ పడలేదు. అలాంటి హిట్ ను పట్టుకోవడానికి ఆయన మాత్రం తనవంతు ప్రయత్నం తాను చేస్తూనే వస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. కరోనా కారణంగా షూటింగు ఆగిపోయింది. ప్రస్తుతం మారుతి ఒక కొత్త కథపై కసరత్తు చేస్తున్నాడట. ఈ మాటను ఆయనే స్వయంగా చెప్పాడు. వైవిధ్యభరితమైన ఒక కథను తయారు చేస్తున్నట్టుగా ఆయన చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఈ కథతోనే సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. ప్రేక్షకులు ఆశిస్తున్న కొత్తదనాన్ని అందించకపోతే ఇక్కడ మనుగడ కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

More Telugu News