గుజరాత్ తీరాన్ని తాకిన తౌతే... 2 గంటల పాటు కొనసాగనున్న విధ్వంసం
- అరేబియా సముద్రంలో తౌతే తుపాను
- పెను తుపానుగా తీరాన్ని చేరిన వైనం
- గుజరాత్ తీరప్రాంతాల్లో విలయం
- గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
- తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
తౌతే పెను తుపాను స్థాయిలో తీరాన్ని తాకడంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఇప్పటికే లక్షల మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో తీర ప్రాంత పట్టణ ఆసుపత్రుల్లోని కొవిడ్ రోగులు కూడా ఉన్నారు.