బాలకృష్ణ సినిమాకి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్?
- జులైలో పూర్తికానున్న 'అఖండ'
- దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
- అదే రోజున సెట్స్ పైకి గోపీచంద్ మలినేని మూవీ
- మూడో ఛాన్స్ కొట్టేసిన శ్రుతిహాసన్
ఆ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, ఆమె ఎంపిక గోపీచంద్ మలినేనికి సెంటిమెంట్ గా మారిపోయింది. అందువల్లనే ఆమెను మళ్లీ సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఆయన అడగ్గానే శ్రుతి హాసన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 'అఖండ' సినిమా జులైలో పూర్తి కానుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దసరాకే గోపీచంద్ మలినేని సినిమాను లాంచ్ చేయాలనుకుంటున్నారట.