పుష్ప శ్రీవాణి ఎస్టీనే... తేల్చిన విచారణ కమిటీ
- ఏపీ డిప్యూటీ సీఎం కులంపై వివాదం
- పిటిషన్ వేసిన రేగు మహేశ్
- విచారణకు ఆదేశించిన కోర్టు
- పుష్ప శ్రీవాణి కొండదేవర కులస్తురాలేనన్న కమిటీ
పుష్ప శ్రీవాణి గిరిజనురాలు కాదంటూ గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోర్టు డీఎల్ఆర్ సీ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ పుష్ప శ్రీవాణి గిరిజనురాలేనని స్పష్టం చేసింది.