Raghu Rama Krishna Raju: జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య పరీక్షల నివేదిక

  • గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు
  • కొద్దిసేపటి కిందట జిల్లా కోర్టుకు రిపోర్టు సమర్పణ
  • ప్రత్యేక మెసెంజర్ ద్వారా ఆ రిపోర్టును హైకోర్టుకు పంపిన జిల్లా కోర్టు
  • కాసేపట్లో హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం
District court sends Raghurama medical report to high court

ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించిన మీదట హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. హైకోర్టు ఈ మెడికల్ రిపోర్టును పరిశీలించి కాసేపట్లో నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి.

అంతకుముందు, జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికపై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News