'వీరమల్లు'లో రాణి పాత్రలో కనిపించనున్న జాక్వెలిన్!
- క్రిష్ నుంచి 'హరిహర వీరమల్లు'
- బందిపోటు పాత్రలో పవన్
- కథానాయికగా నిధి అగర్వాల్
- కరోనా కారణంగా ఆగిన షూటింగ్
మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలో జాక్వెలిన్ కనిపించనుందని చెబుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె పాత్ర నిలుస్తుందని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలవుతుందని చెబుతున్నారు. పవన్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది.