Air India: ఎయిరిండియాపై అమెరికా కోర్టులో దావా వేసిన కెయిర్న్ ఎనర్జీ

  • ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ లో సుదీర్ఘ కాలం నడిచిన వివాదం
  • 1.2 బిలియన్ డాలర్లను చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పు
  • విదేశాల్లోని భారత్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్న కెయిర్న్
Petition filed against Air India in US court

భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థపై అమెరికా కోర్టులో కెయిర్న్ ఎనర్జీ కేసు వేసింది. పన్ను క్లెయిమ్స్ కు సంబంధించి భారత ప్రభుత్వం, కెయిర్న్ ఎనర్జీ మధ్య ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ లో సుదీర్ఘ వివాదం నడిచింది. చిరవకు కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్లు, దానిపై వడ్డీ, దావా ఖర్చులు చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది. దీంతో, భారత్ కు విదేశాల్లో గల ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై కెయిర్న్ దృష్టి సారించింది. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

న్యూయీర్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కెయిర్న్స్ వేసిన పిటిషన్ లో... ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వ యాజమాన్య కంపెనీ అని, చట్ట పరంగా భారత ప్రభుత్వం నుంచి ఈ సంస్థ వేరు కాదని పేర్కొంది. భారత ప్రభుత్వానికి, ఎయిర్ ఇండియాకు తేడా ఉందనే విషయం భ్రమ అని తెలిపింది.

ఇందులో భాగంగానే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సింగపూర్, క్యూబెక్ కోర్టులో కేసులు వేసింది. మరోవైపు దీనిపై భారత అధికారులు స్పందిస్తూ, ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయడానికి ప్రొసీడింగ్స్ ప్రారంభమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మన దేశ ప్రయోజనాలు, సార్వభౌమ హక్కులను కాపాడుకోగలమని తెలిపారు.

More Telugu News