ఈ ఏడాది చివరకు భారత్లో 200 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉంటాయి: నీతి ఆయోగ్
- దేశంలో కొనసాగుతున్న కరోనా టీకాల కొరత
- నీతి ఆయోగ్ సభ్యుడు వికె.పాల్ నుంచి ఊరటనిచ్చే అంశం
- కొవిషీల్డ్ 75 కోట్లు, కొవాగ్జిన్ 55 కోట్లు అందే అవకాశం
- అనుమతి పొందని టీకాలు సైతం అప్పటికి అందుబాటులోకి వచ్చే సూచనలు
ఇక 200 కోట్ల డోసుల్లో సీరం తయారు చేస్తున్న కొవిషీల్డ్ 75 కోట్లు, కొవాగ్జిన్ 55 కోట్లు వుంటాయని పాల్ వెల్లడించారు. అలాగే బయోలాజికల్-ఈ 30 కోట్లు, నొవావాక్స్ 20 కోట్లు, స్పుత్నిక్-వి 15.6 కోట్లు, భారత్ బయోటెక్ ముక్కు ద్వారా ఇచ్చే టీకా 10 కోట్లు, జైడస్ క్యాడిలా 5 కోట్లు, జెన్నోవాకు చెందిన టీకా డోసులు 6 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీటిలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి తప్ప మిగిలిన వాటి వినియోగానికి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.