భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రమేశ్‌ పొవార్‌

Ramesh powar appointed as head coach of indian women cricket team
  • ప్రకటించిన బీసీసీఐ
  • మొత్తం 35 మంది పోటీ
  • పొవార్‌ వైపే మొగ్గుచూపిన అడ్వైజరీ కమిటీ
  • రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న పొవార్‌
భారత మహిళల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పొవార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బోర్డు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. పొవార్‌ ఈ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఉన్న కోచ్‌ డబ్ల్యూవీ.రామన్‌కి ముందు పొవారే ఆ స్థానంలో ఉన్నారు.

ఈ పదవి కోసం మొత్తం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేసింది. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా పొవార్‌ వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. 2018లో జులై-నవంబర్‌ మధ్య కోచ్‌గా కొనసాగిన పొవార్‌.. జట్టులో సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌తో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో వేటుకు గురయ్యారు. కెరీర్లో 2 టెస్టులు ఆడిన పొవార్ 6 వికెట్లు తీశాడు. 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీ గెలుచుకున్న ముంబయి జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించారు.
Go Back to Shorts
BCCI
Ramesh Powar
Indian women's cricket team
Head Coach

More Telugu News