BCCI: భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రమేశ్‌ పొవార్‌

  • ప్రకటించిన బీసీసీఐ
  • మొత్తం 35 మంది పోటీ
  • పొవార్‌ వైపే మొగ్గుచూపిన అడ్వైజరీ కమిటీ
  • రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న పొవార్‌
Ramesh powar appointed as head coach of indian women cricket team

భారత మహిళల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పొవార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బోర్డు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. పొవార్‌ ఈ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ప్రస్తుతం ఉన్న కోచ్‌ డబ్ల్యూవీ.రామన్‌కి ముందు పొవారే ఆ స్థానంలో ఉన్నారు.

ఈ పదవి కోసం మొత్తం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేసింది. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా పొవార్‌ వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. 2018లో జులై-నవంబర్‌ మధ్య కోచ్‌గా కొనసాగిన పొవార్‌.. జట్టులో సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌తో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో వేటుకు గురయ్యారు. కెరీర్లో 2 టెస్టులు ఆడిన పొవార్ 6 వికెట్లు తీశాడు. 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీ గెలుచుకున్న ముంబయి జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించారు.

More Telugu News