ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను భారత సరిహద్దులకు తరలిస్తున్న చైనా
- వ్యూహాత్మకమేనంటున్న నిపుణులు
- చైనా తరలించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు
- షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ లో మోహరింపు
- గాల్వన్ లోయకు సమీపంలోనే షిన్ జియాంగ్ కమాండ్
కాగా, యుద్ధ రంగంలో కీలకంగా భావించే రాకెట్ లాంచర్లను చైనా తరలించడం వ్యూహాత్మకమేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాకెట్ దాడులతో ప్రత్యర్థి పదాతి బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టడం సాధ్యమవుతుంది. షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ స్థావరానికి రాకెట్ లాంచర్ల తరలింపును చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. ఇక్కడ మోహరించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు, శతఘ్నులు ఉన్నట్టు సీసీటీవీ విడుదల చేసిన చిత్రాల ద్వారా అర్థమవుతోంది.