సీక్వెల్ పనిలోపడ్డ 'జాంబిరెడ్డి' డైరెక్టర్!
- కొత్త కథలకు ప్రాధాన్యత
- ప్రయోగాల పట్ల ఆసక్తి
- 'జాంబి రెడ్డి'కి సీక్వెల్
- త్వరలో సెట్స్ పైకి
'జాంబి రెడ్డి' సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రశాంత్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడట. 'జాంబి రెడ్డి'కి మించి ఈ సీక్వెల్ హారర్ తో సాగుతుందని అంటున్నాడు. ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనీ, కరోనా ప్రభావం తగ్గగానే షూటింగు మొదలుకావొచ్చని చెబుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత సమంత ప్రధాన పాత్రధారిగా ఆయన ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.