Tollywood: చరణ్‌-శంకర్‌ క్రేజీ ప్రాజెక్టులో మరో స్టార్‌ హీరో?

  • శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రం
  • నిర్మాతగా దిల్‌ రాజు
  • భారీ తారాగణం ఉండే అవకాశం
  • కీలక పాత్రలో కిచ్చా సుదీప్‌ అని చర్చ
  • అభిమానుల్లో భారీ అంచనాలు
Another statr hero in shanker charan crazy project

జెంటిల్‌మన్‌, అపరిచితుడు, రోబో, ఐ వంటి భారీ సినిమాలతో ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన స్టార్ డైరెక్టర్‌ శంకర్‌, టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రం కావడంతో దీంట్లో భారీ తారాగణం సైతం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ముఖ్యమైన వార్త సినీ వర్గాల్లో ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది.

ఇప్పటికే ఈగ, సైరా నరసింహారెడ్డిలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుదీప్‌ సానుకూల సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు పవర్‌ఫుల్‌ వ్యక్తుల సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సుదీప్‌ కూడా చేరనున్నారని తెలిసి అభిమానుల అంచనాలు తారస్థాయికి చేరాయి.

More Telugu News