కొవిడ్ రోగుల మృతికి కారణమైన కర్నూలు కేఎస్ కేర్ ఆసుపత్రి ఎండీ అరెస్ట్
- అనుమతి లేకుండా కొవిడ్ రోగులకు చికిత్స
- రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు
- పరారీలో ఆసుపత్రి డైరెక్టర్
వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి మృతికి కారణమయ్యారని నిర్ధారించారు. అలాగే, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులపై డాక్టర్ నాగప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి ఎండీ లాల్బహదూర్శాస్త్రిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన ఆసుపత్రి డైరెక్టర్ నర్సింహులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.