Teachers: కరోనా రోగుల బాధ్యతలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పగించిన గుంటూరు జిల్లా కలెక్టర్!

  • గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ
  • పెరిగిపోతున్న కేసులు
  • కరోనా వేళ టీచర్లకు ప్రత్యేక బాధ్యతలు
  • రోగుల బాగోగులు చూసుకోవాలంటూ ఫోన్లకు సందేశాలు
Govt teachers as care takers for corona patients

గుంటూరు జిల్లాలో కరోనా రోగుల సంఖ్య మరింత పెరుగుతున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో మానవ వనరులను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కరోనా రోగుల బాధ్యతలను ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పగించారు. టీచర్లను కొవిడ్ బాధితులకు కేర్ టేకర్లుగా నియమించారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి.

ప్రతి ఉపాధ్యాయుడికి ఒక కరోనా బాధితుడి బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. టీచర్లు ఫోన్ ద్వారా 14 రోజుల పాటు కరోనా బాధితుడి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ వివరాలను గూగుల్ షీట్ లో నమోదు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది.

More Telugu News