Southwest Monsoon: జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

IMD says southwest monsoon ti hit Kerala coast in time
షార్ట్స్‌లో చూడండి
దేశ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. సాధారణ రీతిలోనే జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకటనపై కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ స్పందించారు.

నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని, జూన్ 1న కేరళను తాకి, ఆపై దేశంలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఇది ముందస్తు సూచన అని వివరించారు. అధికారికంగా ఈ నెల 15న ప్రకటన ఉంటుందని, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కారణంగా నమోదయ్యే వర్షపాతం వివరాలపై ఈ నెల 31న అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు.
Go Back to Shorts
Southwest Monsoon
Kerala
IMD
India

More Telugu News