జమ్మూ కశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... ముగ్గురు టెర్రరిస్టుల హతం
- షోపియాన్ జిల్లాలో కాల్పులు
- ఓ ప్రాంతంలో నక్కిన టెర్రరిస్టులు
- లొంగిపోవాలని విజ్ఞప్తి చేసిన భద్రతా బలగాలు
- కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు
- దీటుగా స్పందించిన భద్రతా దళాలు
కానీ ముష్కరులు మొదట ఓ గ్రనేడ్ విసిరి, ఆపై కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. అనంతరం, ఘటన స్థలంలో ముగ్గురు టెర్రరిస్టుల మృతదేహాలను గుర్తించారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
కాగా, కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులను అల్ బదర్ సంస్థకు చెందినవారిగా భావిస్తున్నారు. వీరందరూ స్థానికులేనని, ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరారని పోలీసులు తెలిపారు. కాగా, ఒక ఉగ్రవాది లొంగిపోయినట్టు సమాచారం.