ఆ విషయం చంద్రబాబుకు తెలియదా?: సజ్జల
- కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది
- కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం అధీనంలో ఉంటుంది
- ప్రజల ఆరోగ్యం కోసం కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం
ప్రజల సంక్షేమం తప్ప సీఎం జగన్ కు మరో ధ్యాస లేదని సజ్జల అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి కర్ఫ్యూని అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. రోజుకు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చే సామర్థ్యం ఏపీకి ఉందని.. కేంద్రం సరిపడా డోసులు ఇస్తే 35 రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు.