మెక్సికోలో వంతెన పైనుంచి పడిపోయిన రైలు... 20 మంది మృతి
- మెక్సికోలో విషాదం
- ఓవర్ పాస్ కూలిపోయిన వైనం
- కిందకు పడిపోయిన రైలు బోగీలు
- క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో పలు బోగీలు ధ్వంసం అయ్యాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మెక్సికో సిటీ మేయర్ క్లాడియో షైన్బమ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఓవర్ పాస్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సెలో ఎబ్రాడ్ గతంలో నగర మేయర్ గా ఉన్న సమయంలో ఈ ఓవర్ పాస్ నిర్మించారు.