సీఎంగా ఈ నెల 5న మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
- బెంగాల్ లో టీఎంసీ జయభేరి
- మూడో పర్యాయం అధికార పీఠంపై టీఎంసీ
- శాసనసభాపక్ష నేతగా మమతను ఎన్నుకున్న పార్టీ నేతలు
- ఇవాళ గవర్నర్ ను కలవనున్న మమతా బెనర్జీ
బెంగాల్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎనిమిది విడతల పాటు సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మమత ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా వంటి హేమాహేమీలు సైతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఎక్కడా తగ్గకుండా ఓ బెబ్బులిలా సత్తా చాటారు.