కోర్టుల వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించలేము: సుప్రీంకోర్టు
- కోర్టు వాదనలను మీడియా సంపూర్ణంగా ప్రసారం చేయాలి
- న్యాయ వ్యవస్థలో హైకోర్టులు చాలా కీలకం
- హైకోర్టులను మేము కించపరచలేము
మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను మీడియా ప్రముఖంగా ప్రసారం చేయడంపై తాము ఇప్పటికిప్పుడే కలగజేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలు, ఉత్తర్వులు ఫైనల్ అని స్పష్టం చేసింది. హైకోర్టులను తాము కించపరిచబోమని చెప్పింది. న్యాయ వ్యవస్థలో హైకోర్టులు చాలా ప్రధానమైనవని తెలిపింది. విచారణ సమయంలో హైకోర్టు జడ్జిలు చేసే వ్యాఖ్యలను తాము నియంత్రించలేమని చెప్పింది.