మోదీ, షా చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలింది.. రాజీనామా చేయాలి: యశ్వంత్ సిన్హా
- ఎన్నికల ప్రచారంలో మమతను అడుగడుగునా అవమానించారు
- బీజేపీ తీరుతో బెంగాల్ ప్రజల మనోభావాలు గాయపడ్డాయి
- మోదీ, షాలకు తగిన గుణపాఠం చెప్పారు
పశ్చిమ బెంగాల్ ఫలితాల ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోపాటు 2024 పార్లమెంట్ ఎన్నికలపైనా ఉంటుందని సిన్హా పేర్కొన్నారు. కాగా, వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా బీజేపీ పరిస్థితి, భారత ప్రజాస్వామ్యం రెండూ తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆరోపిస్తూ 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు.