పార్టీ మారిన వాళ్లను ప్రజలు తిరస్కరించారు: బెంగాల్ బీజేపీ చీఫ్
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం
- బలమైన ప్రతిపక్షంగా మారాం
- ప్రజల నాడిని అంచనా వేయలేకపోయాం
ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది నేతలు ఓటమి పాలయ్యారని దిలీప్ ఘోష్ వివరించారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన నేతలను ప్రజలు అంగీకరించలేదన్నారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదన్నారు. ప్రజల నాడిని అంచనా వేయలేమని, ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తామని దిలీప్ ఘోష్ చెప్పుకొచ్చారు.