నాగార్జునసాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
- నాగార్జునసాగర్ బరిలో టీఆర్ఎస్ విజయం
- జానారెడ్డిపై నెగ్గిన నోముల భగత్
- స్పందించిన సీఎం కేసీఆర్
- త్వరలోనే నాగార్జునసాగర్ లో పర్యటిస్తానని వెల్లడి
- ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున నోముల తనయుడు భగత్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నాయక్ పోటీ చేశారు.