లక్ష రూపాయల పింఛను సొమ్ముతో వలంటీరు పరార్!
- 43 మంది లబ్ధిదారుల సొమ్ముతో పరారీ
- బైరాపురం ఒకటో క్లస్టర్ వలంటీరు మధుసూదన్రెడ్డి గురించి పోలీసుల వెతుకులాట
- ఇంటికి చేరని వలంటీరు
డబ్బులు తీసుకున్నప్పటికీ శనివారం సాయంత్రం వరకు డబ్బులు పంపిణీ కాకపోవడంతో లబ్దిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మధుసూదన్రెడ్డికి అధికారులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులను సంప్రదించగా ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుసూదన్రావు డబ్బులు తీసుకుని పరారైనట్టు ఈవోఆర్డీ నటరాజ్ ధ్రువీకరించారు.