ఇక్కడే ఉండిపోయిన ప్రకాశ్ రాజ్ .. ఇటలీలో ఆగిపోయిన షూటింగ్!
- విక్రమ్ కుమార్ నుంచి రానున్న 'థాంక్యూ'
- చైతూ జోడీగా ముగ్గురు కథానాయికలు
- కొన్ని రోజులుగా ఇటలీలో జరిగిన షూటింగ్
కథ ప్రకారం ఇటలీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. దాంతో ఈ సినిమా టీమ్ కొన్నిరోజుల క్రితం ఇటలీ వెళ్లింది. చైతూ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి ప్రకాశ్ రాజ్ ఇక్కడి నుంచి ఇటలీ చేరుకోవలసి ఉంది. అయితే కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఇటలీకి ఇండియా నుంచి వచ్చే విమానాలను నిలిపివేశారు. దాంతో ప్రకాశ్ రాజ్ అక్కడికి వెళ్లలేకపోయారు. ఫలితంగా అక్కడ షూటింగు ఆగిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.