అచ్చంపేట భూములపై విచారణ షురూ... ఈటల ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు
- భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు
- ఈటలపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాల సేకరణ
- తూప్రాన్ ఆర్డీవో రామ్ ప్రకాశ్ నేతృత్వంలో భూముల సర్వే
- ఈటల ఫాంహౌస్ వద్ద మోహరించిన పోలీసులు
దీంతో ఈ రోజు ఉదయమే అచ్చంపేటకు చేరుకున్న అధికారులు.. ఈటలపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రామ్ ప్రకాశ్ నేతృత్వంలో భూముల సర్వే కూడా కొనసాగుతోంది. అచ్చంపేటలో పోలీసులు భారీగా మోహరించారు.
మంత్రి ఈటల ఫాంహౌస్ వద్ద కూడా పోలీసులు మోహరించడం గమనార్హం. మరోవైపు, శామీర్పేటలోని ఈటల రాజేందర్ ఇంటి వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.