ఏపీలో కరోనా విలయతాండవం... కొత్తగా 17,354 మందికి పాజిటివ్
- గత 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు
- 17 వేలకు పైగా కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు
- చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,764 కేసులు
- గుంటూరు జిల్లాలోనూ 2 వేలకు పైన కేసులు
- రాష్ట్రంలో మరో 64 మంది మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. ఓవరాల్ గా 9,70,718 మంది కోలుకోగా, ఇంకా 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,992కి పెరిగింది.