ఆరోగ్య మంత్రి ఈటల చెపితే వినేవాళ్లు కరువయ్యారు: భట్టి విక్రమార్క

No one is hearing Etela Rajender says Bhatti Vikramarka
  • ఆసుపత్రుల్లో ఇంతవరకు సౌకర్యాలను పెంచలేకపోయారు
  • సచివాలయం లేకపోవడంతో పాలన కుప్పకూలింది
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
తెలంగాణలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని... రాష్ట్రంలోని కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా ప్రారంభమై ఏడాది దాటిపోతోందని... అయినప్పటికీ ఇంతవరకు ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి సచివాలయం లేకపోవడంతో పాలనా వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారని... పేద ప్రజల వైద్యానికి మాత్రం బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెపుతున్న మాటలను వినేవాళ్లు కూడా ప్రభుత్వంలో లేరని విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
Congress
Etela Rajender
KCR
TRS

More Telugu News