పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న రానా!

Rana Daaggubati Pan India Project
  • వాయిదాపడిన 'విరాటపర్వం'
  • సెట్స్ పై ఉన్న మలయాళ రీమేక్
  • ఆచంట గోపీనాథ్ తో భారీ బడ్జెట్ మూవీ

రానా కథానాయకుడిగా రూపొందిన 'విరాటపర్వం' సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ రోజున విడుదల కావలసి ఉంది. కానీ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది తరువాత ప్రకటించనున్నారు. ప్రస్తుతం రానా .. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రానా ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

రానా హీరోగా చేయనున్న ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి ఆచంట గోపీనాథ్ నిర్మిస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్టును గురించి తాజాగా ఆయన మాట్లాడారు. రానా కోసం ఒక విభిన్నమైన  కథను సిద్ధం చేయించాము. కథ.. కథనం చాలా కొత్తగా ఉంటాయి. రానా ఇంతవరకూ చేయని పాత్ర ఇది .. ఆయన చాలా కొత్తగా కనిపిస్తాడు. రానాకి ఈ కథ చాలా బాగా నచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నాం. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తికాగానే, మా ప్రాజెక్టుపైకి వచ్చేస్తాడు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాము" అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి పాన్ ఇండియా అంటూ రానా కూడా రంగంలోకి దిగిపోయాడన్న మాట.

Go Back to Shorts
Rana
Achanta Gopinath
Pan India Movie

More Telugu News