ఇజ్రాయెల్లో విషాదం.. మౌంట్మెరెన్ వద్ద తొక్కిసలాటలో 44 మంది మృతి
- లాగ్ బౌమర్ పండుగ సందర్భంగా తరలివచ్చిన వేలాదిమంది భక్తులు
- ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన 38 మంది
- రంగంలోకి ఆర్మీ
- భారీ విపత్తు అన్న ప్రధాని బెంజమన్ నెతన్యాహు
మౌంట్ మెరైన్లోని రెండో శతాబ్దం నాటి మత గురువు రబ్బీ షిమోన్ బార్ యో హై సమాధి వద్ద నివాళులు అర్పించే సమయంలో ఘటన చోటుచేసుకుంది. వేలాదిమంది భక్తులు ఒకే మూలకు తోసుకురావడంతో ముందున్నవారు కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భారీ విపత్తు అని పేర్కొన్నారు. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్మీ క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను ఉపయోగించింది.