తెలంగాణలో ప్రారంభమైన కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు
- రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఓటర్లు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు మునిసిపాలిటీల పరిధిలోని 248 వార్డులకు గాను 1,307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11,34,032 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 3న ఫలితాలు విడుదల కానున్నాయి.