'కర్ణన్' రీమేక్ లో బెల్లంకొండ హీరో!
- నిరాశ పరిచిన 'అల్లుడు అదుర్స్'
- బాలీవుడ్ రీమేక్ గా 'ఛత్రపతి'
- కరోనా ఉధృతి తగ్గగానే సెట్స్ పైకి
ఒక వైపున ఈ సినిమా కోసం రెడీ అవుతూనే ఆ తరువాత తెలుగు సినిమాను లైన్లో పెట్టే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు. తెలుగులో ఆయన చేయనున్న నెక్స్ట్ మూవీ 'కర్ణన్' రీమేక్ అని తెలుస్తోంది. ధనుశ్ హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. 'ఛత్రపతి' రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత 'కర్ణన్' రీమేక్ షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.