ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన
- ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- దక్షిణాంధ్ర, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు
- ద్రోణి కారణంగా కురవనున్న వర్షాలు
ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. మరోవైపు 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు బీహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీర ప్రాంతమైన ఒడిశా వరకు వ్యాపించినట్టు తెలిపింది.