వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్: సీఎం జగన్
- ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ పై సీఎం సమీక్ష
- వ్యాక్సినేషన్ ఓ సమస్యగా మారిందని వెల్లడి
- 18-45 ఏళ్ల వారికి సెప్టెంబరు నుంచి టీకా
- ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు
- వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచన
ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్పి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2022 ఫిబ్రవరి వరకు అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.