వాయిదా పడిన మణిరత్నం షూటింగ్
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం
- జూన్ నుంచి మళ్లీ షూటింగ్
ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మధ్యప్రదేశ్ లో ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగు చేయడం కుదరలేదు. అక్కడ చిత్రీకరించవలసిన సన్నివేశాలను చెన్నైలోనే కానిచ్చేద్దామని అనుకుంటే, ఇక్కడ కూడా కరోనా ఉధృతి కారణంగా షూటింగు ఆగిపోయింది. దాంతో జూన్ లో మళ్లీ సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లోగా కరోనా ప్రభావం చాలావరకూ తగ్గవచ్చని భావిస్తున్నారట. ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఇది ఒక చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలను మణిరత్నం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.