సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు
- ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్
- విచారణకు అర్హమైనదిగా భావించిన సీబీఐ కోర్టు
- జగన్ తో పాటు సీబీఐకి నోటీసులు
- పిటిషన్ లో అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- వచ్చే నెల 7న విచారణ
కొన్నిరోజుల కిందట రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయగా, తొలుత సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది. అయితే కొన్ని సవరణల అనంతరం రఘురామ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఈసారి స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.