ప్రజల ధనంతో వ్యాక్సిన్ తయారు చేసి.. వారికే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు: రాహుల్ గాంధీ
- మిత్రుల కోసం మోదీ ప్రజలను దోచుకుంటున్నారు
- మన దేశంలోని టీకానే ప్రపంచంలో ఖరీదైనది
- ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తోంది
టీకా తయారు చేయడానికి ఫార్మా కంపెనీలకు ప్రజా ధనాన్ని కేంద ప్రభుత్వం ఇచ్చిందని... అదే ప్రజలకు అధిక ధరకు వ్యాక్సిన్ అమ్మడానికి అనుమతులు ఇచ్చిందని రాహుల్ దుయ్యబట్టారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ మన దేశంలో అమ్ముతున్నదేనని చెప్పారు. మోదీ విఫల విధానం... ప్రజలను మరోసారి మోసం చేస్తోందని అన్నారు. స్నేహితుల లాభం కోసం ప్రజలను మోదీ దోచుకుంటున్నారని మండిపడ్డారు.