కొవిడ్ ఎక్కువగా ఉంటే హైదరాబాదు వెళ్లిపోతాడు... తక్కువగా ఉంటే ఏపీలో తిరుగుతాడు: చంద్రబాబుపై పేర్ని నాని వ్యాఖ్యలు
- చంద్రబాబుపై పేర్ని నాని ధ్వజం
- ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం
- మంచి సలహా ఇవ్వాలన్న ఆలోచనే లేదని వ్యాఖ్యలు
- ప్రజలను కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటన
కొవిడ్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని ఉద్ఘాటించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అవసరానికి తగినట్టుగా ఆక్సిజన్, రెమ్ డెసివిర్ అందుబాటులో ఉంచామని చెప్పారు.