New Delhi: దారుణం.. ఢిల్లీ అధికారిక డేటాలో మిస్ అయిన వెయ్యికి పైగా కరోనా మరణాలు!

  • ఢిల్లీలో కరోనా మరణ మృదంగం
  • ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు
  • శవాల దహనాలకు, డేటాకు పొంతన లేని వైనం
Over 1000 Covid Deaths Missing In Delhi Data

ఢిల్లీలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. భారీ ఎత్తున కేసులు నమోదవుతుండటమే కాకుండా.. ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఒక సంచలన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. దాదాపు వెయ్యి మందికి పైగా కరోనా మృతుల వివరాలు అధికారిక డేటాలో లేకపోవడం సంచలనం రేపుతోంది.

ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. మున్సిపల్ కార్పొరేషన్లలో నమోదయిన వివరాలకు, ఢిల్లీలోని శ్మశానవాటికల్లో దహనమైన కరోనా మృతుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదని సదరు మీడియా వెల్లడించింది. వెయ్యి మందికి పైగా మృతుల వివరాలు ఢిల్లీ ప్రభుత్వ అధికారిక డేటాలో లేవనే విషయాన్ని బయటపెట్టింది.

More Telugu News