'సర్కారువారి పాట'లో కామెడీ హైలైట్ అట!
- వినోదభరితమైన కథతో 'సర్కారువారి పాట'
- బ్యాంకు అధికారి కొడుకుగా మహేశ్ బాబు
- కథానాయికగా కీర్తి సురేశ్
ఈ సినిమాకి కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సప్తగిరి .. ప్రియదర్శి .. అనసూయ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు. కన్ఫ్యూజన్లో సాగే ఈ కామెడీ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. హీరో తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. తన తండ్రికి చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం రంగంలోకి దిగిన హీరో, ఆ బిజినెస్ మెన్ తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అట. అందుకు మహేశ్ బాబు వేసే ప్లాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు.